ఓకే.. వెనక్కి తీసుకుందాం

by  |
ఓకే.. వెనక్కి తీసుకుందాం
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన చేసింది. భారత్-చైనా సరిహద్దు వివాదమై కోర్ కమాండర్ స్థాయి మిలటరీ అధికారుల మధ్య జరిగిన భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు అందులో పేర్కొన్నది. స్నేహపూర్వక, సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపింది. సరిహద్దుల నుంచి బలగాలను వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. రెండు దేశాల వైపుల నుంచి చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలని రెండు దేశాల సైనికాధికారులు నిర్ణయించినట్లు పేర్కొన్నది.

Next Story