- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చిన్మయి శ్రీపాద… సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచిపేరు తెచ్చుకుంది. మీటూ ఉద్యమంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది కూడా. తనతోపాటు ఇతర అమ్మాయిలను సింగర్ కార్తీక్ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆరోపణలు చేసిన చిన్మయి ఇదే విషయంపై సీనియర్ గాయకుడు మనోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కార్తీక్, మనోలు గొప్ప సింగర్స్ కావచ్చేమో కానీ… గొప్ప మనుషులు కాదని విమర్శించింది.
కొన్ని రోజుల క్రితం మనో తనను పిలిచారని… కార్తీక్ ప్రవర్తనతో బాధపడిన అమ్మాయిలను కలవాలని కోరాడని తెలిపింది. ఈ క్రమంలో మనో ఇంటికి వెళ్లగా బుజ్జగించినట్లు తెలిపింది. కార్తీక్పై చేసిన ఆరోపణలతో కార్తీక్ భార్య బాధపడుతోందని.. కార్తీక్ కెరియర్ నాశనం అవుతుందని చెప్పాడని తెలిపింది. అంతగా కష్టపడి వచ్చిన నువ్వు, కార్తీక్ మంచి స్నేహితులుగా ఉండాలని చెప్పి రాజీ కుదిర్చేందుకు యత్నించాడని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కానీ కష్టపడి గొప్ప సింగర్గా ఎదిగిన వ్యక్తి ఇతరులను వేధించడం మంచిదేనా అని ప్రశ్నించింది చిన్మయి. గొప్ప స్థాయికి చేరితే పక్కవాళ్లకు ఇబ్బంది కలిగించాల్సిందేనా అని మండిపడింది.