- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ : కరోనా వైరస్ పై దాదాపు మూడు నెలలు పోరాడి నిలువరించిన చైనా మళ్లీ దాని ముప్పును ఎదుర్కొంటున్నది. ఈ దేశం నుంచే విదేశాలకు పాకిన వైరస్ ఇప్పుడు విదేశాల నుంచి మళ్లీ చైనాకు వ్యాపిస్తున్నది. చైనాలో స్థానికంగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. కానీ, విదేశాల నుంచి వస్తున్నవారు దాన్ని వెంట పట్టుకొస్తున్నారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 649 మందిలో కరోనా పాజిటివ్ గా తేలింది. శుక్రవారం ఒక్కరోజే 54 కేసులు విదేశాల నుంచి దిగుమతి అయినట్టు ఆ దేశ సర్కారు వెల్లడించింది. ఈ మహమ్మారితో శుక్రవారం ముగ్గురు మరణించారు. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,295కు చేరింది. చైనా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,394కు చేరింది. విదేశాల నుంచి కరోనా కేసులు దిగుమతి అవుతున్న నేపథ్యంలో ఆ దేశం అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఒక విమానయాన సంస్థ నుంచి వారానికి ఒక దేశానికి కేవలం ఒక్క విమానమే వెళ్లేలా రేపట్నుంచి నియంత్రించనుంది.
Tags: Coronavirus, China, spread, import, contain