800 మీటర్ల భారత భూభాగంపై కన్నేసింది

by  |
800 మీటర్ల భారత భూభాగంపై కన్నేసింది
X

న్యూఢిల్లీ: ఇండియా, చైనా ట్రూపులు ప్యాట్రోల్ పాయింట్ 14 నుంచి వెనుదిరిగిన తర్వాత డ్రాగన్ మనదేశ భూభాగాన్ని ఎంతమేరకు ఆక్రమించజూసిందో స్పష్టమవుతున్నది. పీపీ 14 నుంచి సుమారు 800 మీటర్ల మేరకు భారత భూభాగాన్ని తమదిగా చైనా డిమాండ్ చేస్తు్న్నది. గాల్వన్ లోయ అంతా తమదేనని చైనా విదేశాంగ పెద్దపెద్ద ప్రకటనలు చేసింది. కాగా, ఈ 800 మీటర్ల భూభాగంపై తొలిసారిగా చైనా ఈ ఏప్రిల్‌లో సైన్యాధికారుల చర్చల్లో మాట్లాడింది.

వెనక్కి తగ్గినా.. అప్రమత్తమే:

గాల్వన్ నుంచి చైనా మిలిటరీ ట్రూపులు వెనక్కి తగ్గడంపై భద్రతావర్గాలు అప్రమత్తంగానే ఉన్నాయి. 61ఏళ్ల క్రితం చైనా జిత్తుల గురించి అందరికీ తెలిసిందే. 1959లో పీపీ 14వరకు తమ భూభాగాలని భారత్, చైనాలు అంగీకరించాయి. తాజాగా, మరో 800 మీటర్ల దూరం మేరకు తమ భూభాగమేనని కొత్తరాగమందుకుంది. ఈ నేపథ్యంలోనే 1962లో ఓ పేపర్ బ్యానర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గాల్వన్ పోస్టు నుంచి చైనా ట్రూపులు వెనక్కి మళ్లుతున్నాయన్న హెడింగ్‌తో ఆ పేపర్ క్లిప్ ఉన్నది. అయితే, సరిగ్గా ఆ హెడింగ్ ప్రింట్ అయిన 91 రోజుల తర్వాత ఇరుదేశాల మధ్య యుద్ధం(1962) బద్ధలైంది. గాల్వన్ సహా పలుప్రాంతాల్లో చైనా ఆర్మీ దిగిన సంగతి తెలిసిందే. కానీ, 2020లో భారత బలం, వ్యూహం వేరు అని నిపుణులు చెబుతున్నారు.

Next Story

Most Viewed