చిరుప్రాయం..పేదలకు సాయం

by  |
చిరుప్రాయం..పేదలకు సాయం
X

దిశ, ఆదిలాబాద్: కరోనా నివారణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న ఆస్పత్రి కార్మికులకు ఇద్దరు చిన్నారులు సహాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ ప్రమోద్ చంద్రరెడ్డి కూతుళ్లు హాసిని, ఆశ్రితల పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రూ. 20 వేల నగదు అందజేశారు. పట్టణంలోని గాంధీచౌక్ ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు రూ. 5 వేలతో ఆహారాన్ని అందించారు. చిన్నారులను జిల్లా ఆసుపత్రుల కో-ఆర్డినేట దేవేందర్‌రెడ్డి అభినందించారు.

Tags: Adilabad, child, help, sanitation, poor

Advertisement
Next Story

Most Viewed