ఏడాది పిల్లాడి తలుపు తట్టిన లచ్చిందేవి

by  |
ఏడాది పిల్లాడి తలుపు తట్టిన లచ్చిందేవి
X

లిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటే ఇదేనేమో… ఏడాది బుడ్డోడు ఒక మిలియన్‌ డాలర్‌ల (సుమారు ఏడు కోట్ల పైచిలుకు) లాటరీ గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయిన అరుదైన ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. దీని వివరాల్లోకి వెళ్తే.. రమీస్‌ రహ్మాన్‌ అనే భారతీయ పౌరుడు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రమీస్ తన ఏడాది వయసున్న కొడుకు మహమ్మద్‌ సాలా పేరు మీద లాటరీ టికెట్‌ కొనుగోలు చేశాడు. లాటరీ సంస్థ నిర్వహించిన లక్కీడ్రాలో మహమ్మద్ సాలా టికెట్ కి లాటరీ తగిలింది. దీంతో ఏడుకోట్ల పైచిలుకు డబ్బులు గెల్చుకున్నాడు. దీంతో రమీస్ ఉబ్బితబ్బిబ్బవుతూ, ఈ రోజు తాను చాలా ఆనందంగా ఉన్నానని అన్నారు. ఇక తనకు భవిష్యత్ పై బెంగ తీరిపోయిందని చెప్పారు. తన కుమారుడి భవిష్యత్ కి ఆ డబ్బు ఎంతో భరోసానిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed