బిజ్జారం బావుల వద్ద యాక్సిడెంట్.. చిన్నారి మృతి

by  |
బిజ్జారం బావుల వద్ద యాక్సిడెంట్.. చిన్నారి మృతి
X

దిశ, కోస్గి: కోస్గి పట్టణ శివారులోని బిజ్జారం బావుల దగ్గర బైక్, ఆటో ట్రాలీ ఢీ కొన్న సంఘటనలో ఏడేళ్ల చిన్నారి మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం కురవి ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. దౌలతాబాద్ v6 మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన భారతమ్మ, అనిల్, చిన్నారి శిరీషలు ద్విచక్రవాహనంపై కోస్గి నుంచి తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో బై‌కును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి శిరీష సంఘటన స్థలంలోనే మృతిచెందగా భారతమ్మ, అనిల్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను చికిత్స కోసం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినట్లు ఎస్సై వివరణ ఇచ్చారు.


Next Story

Most Viewed