'మా చిన్నారి మృతికి మీరే కారణం'

by  |
మా చిన్నారి మృతికి మీరే కారణం
X

దిశ, వరంగల్: వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యం వికటించి మూడు రోజుల చిన్నారి మృత్యువాత పడింది. న్యాయం చేయాలంటూ బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మూడు రోజుల క్రితం నర్సంపేట మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన శ్రీలోజు సరిత ప్రసవం కోసం సీకేఎం ఆస్పత్రిలో చేరగా పండంటి పాపకి జన్మనిచ్చింది. సోమవారం పాపకు వైద్యులు టీకా వేయడంతో చిన్నారి నీలిరంగులోకి మారిందని వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పాప మరణించిందని సరిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం మేరకు ఇంతేజార్ గంజ్ సీఐ రాయల వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

Next Story

Most Viewed