జాతీయ రహదారిలో చికెన్ వ్యర్థాలు.. పట్టించుకోని అధికారులు..

by  |
జాతీయ రహదారిలో చికెన్ వ్యర్థాలు.. పట్టించుకోని అధికారులు..
X

దిశ, ఆత్మకూర్: ఆత్మకూరుకు చెందిన రాజు చికెన్ సెంటర్ యాజమాన్యం చికెన్ వ్యర్థాలను హన్మకొండ టు ములుగు జాతీయ రహదారిలో వేస్తున్నారు. అక్కడి దుర్గంధాన్ని భరించలేకపోతున్నామంటూ చుట్టు పక్క పొలాల రైతులు ఆందోళన చెందుతున్నారు. చికెన్ వ్యర్థాల కోసం జంతువులు ఎక్కువగా రోడ్ల మీద తిరుగుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై ప్రజలు అనేకమార్లు గ్రామపంచాయతీకి ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదనేది పలువురి ఆరోపణ. ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించి రాజు చికెన్ సెంటర్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



Next Story