జైళ్లశాఖ చేపల అమ్మకాలు ప్రారంభం

by  |

దిశ, మేడ్చల్: చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ ఔట్‌లెట్ వద్ద సోమవారం నుంచి లైవ్ చేపల అమ్మకాలు ప్రారంభిస్తున్నట్టు సూపరింటెండెంట్ దశరథరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 8:30 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. అయితే, కొనుగోళ్ల సమయంలో మాస్కులు ధరించి రావాలనీ, ఔట్‌లెట్ వద్ద సామాజిక దూరం పాటించాలని కోరారు. ఫిష్ ఔట్‌లెట్ ప్రారంభోత్సవానికి జైళ్ల డీఐజీ భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు హాజరుకానున్నట్టు తెలిపారు.

tags: cherlapally, jail department, fish outlet, jail superintendent dasaratha rami reddy, jails dig bhaskar,



Next Story

Most Viewed