ప్రాజెక్టుల నిర్మాణంతో కోటి ఎకరాలకు నీరు

by  |
ప్రాజెక్టుల నిర్మాణంతో కోటి ఎకరాలకు నీరు
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు పైగా సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ పాల్గొన్నారు.


Next Story