ఐపీఎల్‌లో బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

by  |
ఐపీఎల్‌లో బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 8వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. సీఎస్కే జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులకే పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇతడికి వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ మెయిన్ అలీ (46) పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. కానీ, ఆ తర్వాత మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 90 పరుగులకే చెన్నై 2 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా (8), అంబటి రాయుడు(0) డకౌట్‌తో వెనుదిరిగారు. 99 స్కోరు బోర్డు వద్ద సీఎస్కే 4 వికెట్లు కోల్పోయింది. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన సామ్ కర్రన్ (5) పరుగులు చేసి బౌండరీతో ఇన్నింగ్స్‌ను ఫినీష్ చేశాడు. ఈ క్రమంలో 15.4 ఓవర్లలో సీఎస్కే జట్టు 107 పరుగులు చేసి ఐపీఎల్‌ సీజన్‌ 14లో బోణీ కొట్టింది. ఇక పంజాబ్ జట్టులో మహ్మద్ షమి 2, హర్ష్‌దీప్, అశ్విన్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.

పంజాబ్ ఇన్నింగ్స్..

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలం అవడంతో స్కోరు బోర్డు మందగించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షారూఖ్ ఖాన్ ఒక్కడే 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్‌ (5), మయాంక్ అగర్వాల్ (0), క్రిస్ గేల్ (10), నికోలస్ పూరన్‌ను (0), దీపక్ హుడా (10) పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యారు. దీంతో 26 పరుగులకే పంజాబ్ 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మిడిలార్డర్‌లో వచ్చిన షారూక్ స్కోరు బోర్డును మెల్లగా ముందుకు తీసుకెళ్లాడు.

ఇదే క్రమంలో రిచర్డ్ సన్ (15). లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్ మురుగన్ అశ్విన్ (6) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 87 పరుగులకే 7 వికెట్లు నష్టపోయారు. ఇక చివర్లో షారూఖ్ కూడా పెవిలియన్ చేరక తప్పలేదు. 36 బంతుల్లో 47 పరుగులు చేసిన అతడు 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాది.. క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇదే సమయంలో క్రీజులో మహ్మద్ షమీ (9), రిలే మెరెడిత్ (0) పరుగులతో నాటౌట్‌గా ఉండగా నిర్ణీత 20 ఓవర్లు ముగిశాయి. దీంతో 8 వికెట్ల నష్టానికి పంజాబ్ కేవలం 106 పరుగులు మాత్రమే చేసింది.


Next Story

Most Viewed