కాసేపట్లో రసవత్తర పోరు.. టాస్ గెలిచిన చెన్నై

by  |
Chennai vs Bangalore
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌-14లో భాగంగా కాసేపట్లో రసవత్తర పోరు జరుగనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 03:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘ఈ సాలా కప్ నమ్‌దే’ కలను సాకారం చేసేందుకు ఆర్సీబీ వరుస విజయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుంది. మరోవైపు గతేడాది దెబ్బతిన్న సీఎస్కే.. ఈ సారి మాత్రం పంజా విసురుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచుల్లో వరుసగా విజయం సాధించి 8 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉంది. అటు ధోని సేన కూడా ఏ మాత్రం తగ్గకుండా 3 విజయాలు ఒక పరాజయంతో 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. మరి నేడు ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed