మిగిలిన మ్యాచ్‌లలో గెలిచేందుకు కృషి చేస్తాం

by  |
మిగిలిన మ్యాచ్‌లలో గెలిచేందుకు కృషి చేస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. శుక్రవారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా విఫలం అయింది. ఇప్పటివరకూ ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం మూడింట్లో మాత్రమే నెగ్గి, పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో మిగిలిపోయింది. ఇక దీనిపై ఆ జట్టు కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం తమది కాదని తెలిపారు. వరుస ఓటములతో సభ్యులు కూడా బాధపడుతున్నారని వెల్లడించారు. ఇకనైనా మిగిలిన మ్యాచ్‌లలో గెలిచేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు.

Next Story

Most Viewed