కొవిడ్ ఎఫెక్ట్.. అమితాబ్ బచ్చన్ ‘చెహ్రే’ పోస్ట్ పోన్డ్

by  |
Chehre Release Date Postponed
X

దిశ, సినిమా: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆడియన్స్‌ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఫైనల్ డెసిషన్ తీసుకుంది ‘చెహ్రే’ మూవీ యూనిట్. వచ్చే నెల 9న విడుదల కావాల్సిన సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ట్రైలర్ బెస్ట్ రెస్పాన్స్ అందుకోగా ఇప్పటి వరకు ప్రేక్షకుల నుంచి అందిన లవ్, సపోర్ట్‌కు థాంక్స్ చెప్పారు. పర్యావరణం అనుకూలించి, పరిస్థితులు సాధారణం అయ్యాకే ‘చెహ్రే’ను థియేటర్స్‌లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు మేకర్స్. అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం మరిచిపోకూడని సూచించారు.

Next Story