పరవళ్లు తొక్కుతున్న మోయ తుమ్మెద

by  |
పరవళ్లు తొక్కుతున్న మోయ తుమ్మెద
X

దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో తుమ్మెదవాగు ఉరకలేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి.

మోయ తుమ్మెదవాగుకు అనుసంధానంగా ఉన్న గుండారెడ్డిపల్లి, పోరెడ్డిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు చెక్ డ్యాములు మత్తడి దుంకడంతో ఎక్కువైన నీరు వాగులోకి జారుకోవడం ద్వారా వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహిన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.

Next Story

Most Viewed