రాంగ్‌కాల్‌లో పరిచయం.. కట్‌ చేస్తే ప్రేమ.. చివరికి..!

by  |
రాంగ్‌కాల్‌లో పరిచయం.. కట్‌ చేస్తే ప్రేమ.. చివరికి..!
X

దిశ,కంటోన్మెంట్ : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసగించిన ఓ యువకుడిని బోయిన్ పల్లి పోలీసులు ఆరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇన్ స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. పాత బోయిన్ పల్లికి చెందిన రుక్సార్ బేగం(23) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంది. 2017లో చంద్రాయణగుట్ట బండ్లగూడకు చెందిన గొల్డెన్ హైదరాబాదీ యుట్యూబ్ ఛానెల్ నిర్వహకుడు అబ్దుల్ రజాక్ (27) రుక్సార్ బేగంకు రాంగ్ కాల్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే రుక్సార్, అబ్దుల్ అతని ప్రొఫైల్ ద్వారా తెలుసుకొని పరిచయం పెంచుకుంది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అబ్దుల్, రుక్సార్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. వారు సన్నీహితంగా మెలిగారు. కానీ ఈ నెల 3వ తేదీన అబ్దుల్ మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్సార్, అబ్దుల్ ను నిలదీయగా ఆమెనే పెళ్లిచేసుకుంటానని తెగేసి చెప్పాడు. మోసపోయానని గ్రహించిన యువతి బోయిన్ పల్లి పోలీసులను అశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడు అబ్దుల్ ను ఆరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.



Next Story

Most Viewed