యాంకర్ శ్యామల భర్తపై మహిళ ఫిర్యాదు… అరెస్ట్ చేసిన పోలీసులు

by  |
case on anchor shyamala husband
X

దిశ, సినిమా : యాంకర్ శ్యామల భర్త, నటుడు నర్సింహారెడ్డిపై రాయదుర్గం పీఎస్‌లో చీటింగ్ కేసు నమోదైంది. తన నుంచి కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుంచి విడతల వారిగా డబ్బులు ఇచ్చానని తెలిపిన బాధితురాలు.. మనీ అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. అంతే కాదు ఓ మహిళను సెటిల్‌మెంట్‌ కోసం మధ్యవర్తిగా తీసుకొచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నర్సింహారెడ్డితో పాటు మధ్యవర్తిగా ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా శ్యామల, నర్సింహా రెడ్డిలది ప్రేమ పెళ్లి అయినా.. విడాకులు తీసుకున్నారని ఈ మధ్య న్యూస్ హల్ చల్ చేసింది. అయితే అలాంటిదేమీ లేదని తాము కలిసే ఉంటున్నామని క్లారిటీ ఇచ్చింది శ్యామల.



Next Story

Most Viewed