గర్భవతిని చేసి పరారైన ప్రియుడు.. అతడితో పెళ్లికోసం ప్రియురాలు ఏంచేసిందంటే..?

by  |
గర్భవతిని చేసి పరారైన ప్రియుడు.. అతడితో పెళ్లికోసం ప్రియురాలు ఏంచేసిందంటే..?
X

దిశ‌, నెక్కొండ: పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి గ‌ర్భ‌వ‌తిని చేసిన ప్రియుడు, ఆ త‌ర్వాత‌ మొహం చాటేయ‌డంతో ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ మండలం ప‌త్తిపాక తండాలో జ‌రిగింది. బాధితురాలు అనూష తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నెక్కొండ మండ‌లం, ప‌త్తిపాక తండాకు చెందిన బోడ అనూష, నెక్కొండ తండాకు చెందిన పురుషోత్తం కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అనూష గ‌ర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాల‌ని పురుషోత్తంను నిల‌దీసింది. ముందు త‌ప్పించుకోవాల‌ని చూసినా.. ఆతర్వాత పెద్ద మ‌నుషుల మ‌ధ్య పంచాయితీలో పెళ్లికి అంగీక‌రించాడు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. అయితే కొద్దిరోజుల్లో పెళ్లి జ‌రుగుతుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వ‌ర‌క‌ట్నం తెస్తేనే పెళ్లి చేసుకుంటాన‌ని అనూష‌కు పురుషోత్తం చెప్పాడు.

కొన్నిరోజుల క్రితం తండా నుంచి ప‌రారైన పురుషోత్తం హైద‌రాబాద్‌లో ఉంటున్నాడు. అనూష‌కు వేరే వ్య‌క్తుల చేత ఫోన్ చేయిస్తూ అస‌భ్య‌కరంగా మాట్లాడిస్తున్న‌ట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. త‌న‌ను ప్రేమించాల‌ని అర్ధ‌రాత్రి స‌మ‌యాల్లో పురుషోత్తం స్నేహితుడు న‌గేష్ అనే వ్య‌క్తి చేత త‌రుచూ ఫోన్ కాల్స్ చేయిస్తున్న‌ట్లుగా పేర్కొంటోంది. ఇదంతా త‌న క్యారెక్ట‌ర్‌పై మ‌చ్చ వేసేందుకేనంటూ ఆరోపించింది. గ‌త నాలుగు రోజులుగా నిద్ర‌హారాలు మాని ప‌త్తిపాక గ్రామంలో పురుషోత్తం ఇంటి ఎదుటే బాధితురాలు మౌన‌పోరాటం చేస్తోంది. మ‌హిళా సంఘాలు, పోలీసులు త‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని, త‌న‌ను మోసం చేసిన పురుషోత్తంను పెళ్లికి ఒప్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అనూష డిమాండ్ చేస్తోంది.

Next Story