జగన్ డేంజర్ వైరస్: చంద్రబాబు

by  |
Chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్: నా ఇల్లు-నా సొంతం, నా స్థలం-నాకు ఇవ్వాలనే డిమాండ్‌తో రేపటి నుంచి ఈ నెల 10 వరకు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాందోళనలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలన్నారు. లబ్దిదారులైన పేదలకు అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలు వారి వారి ఇండ్లను స్వాధీనం చేసుకునే వరకు వారి తరఫున పోరాటం చేయాలన్నారు. ఏపీని పట్టి పీడిస్తున్న డేంజర్ వైరస్ జగన్ అంటూ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు అంశంలో ప్రభుత్వ తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. టీడీపీ పై బురద జల్లే యత్నం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసేదేమి లేదని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు కోసం కేవలం 400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు. కానీ, గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో రూ. 11 వేల కోట్లు ఖర్చుచేశామన్నారు.



Next Story

Most Viewed