ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన

by  |
ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కాకుండానే అసంతృప్తితో వెనుదిరగాల్సి వచ్చింది. ప్రధాని మోడీ, అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఇక చేసేది లేక ఇంటి ముఖం పట్టారు. దీంతో అపాయింట్మెంట్ దొరికినప్పుడు మరోసారి వచ్చి రాష్ట్రపరిస్థితులను వివరిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది.

ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మాత్రమే చంద్రబాబు అండ్ టీం భేటీ అయ్యింది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే.



Next Story