ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

by  |
ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అణచివేతలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన సర్కారే అసమ్మతిని అణిచివేయడం హాస్యాస్పదం అని విమర్శించారు. అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు.

Next Story

Most Viewed