రైతులను మోసం చేస్తున్నారు : చంద్రబాబు ​

by  |
రైతులను మోసం చేస్తున్నారు : చంద్రబాబు ​
X

దిశ, ఏపీ బ్యూరో : రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు ఇవ్వకుండా వ్యవసాయం పండగ ఎలా అవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ప్రభుత్వంపై ట్విటర్​లో విమర్శలు సంధించారు. పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించలేదని తెలిపారు. తుఫానొస్తే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కులేదని చెప్పారు. ఈ సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తే సస్పెండ్ చేస్తారని దుయ్యబట్టారు. ఊరికే గాలిలో తిరిగి గాలి మాటలు చెప్పడం కాదని మండిపడ్డారు. రైతు కన్నీరు తుడిచి వెంటనే పరిహారం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.


Next Story

Most Viewed