- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: అంతర్వేది రథ నిర్మాణ పనుల పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఇదే వ్యవహారం పై తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘అంతర్వేది నూతన రథ నిర్మాణ పనులను టెండర్లు పిలవకుండానే అప్పగించడంపై అగ్ని(వన్నియ)కుల క్షత్రియుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రథాన్ని స్వామివారి ప్రతిరూపంగా భావించే ఈ అగ్నికుల క్షత్రియులే 1823లో అంతర్వేది ఆలయాన్ని నిర్మించి, నిర్వహణ కోసం1800 ఎకరాల భూమిని ఇచ్చారన్న సంగతి మర్చిపోకూడదు’ అంటూ గుర్తు చేశారు.
‘ఆలయ నిర్మాణం చేసిన అగ్నికుల క్షత్రియులే రథ మరమ్మతులు, నిర్వహణతో పాటు, రథానికి తొలి కొబ్బరికాయ కొట్టడం, రథాన్ని లాగడం 200 ఏళ్ళుగా చేస్తున్నారు. అలాంటిది రథ నిర్మాణం విషయంలో తమ ప్రతిభను గుర్తించలేదంటోన్న వారి బాధను ప్రభుత్వం అర్థం చేసుకుని తక్షణమే స్పందించాలని కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.