కరోనా బాధితుల మృతి బాధాకరం: చంద్రబాబు

by  |
TDP
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా బాధితులు అగ్నిప్రమాదంలో మృతిచెందడం బాధాకరమన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కి 11 మంది కరోనా పేషెంట్లు మృతిచెందిన విషయం విధితమే.

Next Story

Most Viewed