తప్పుడు కేసులని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి: చంద్రబాబు

by  |
తప్పుడు కేసులని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి: చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల అరెస్టుపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ మాధ్యమంగా మరోసారి స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేయగా, ఆ వీడియోలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, కొందరు లారీ యజమానులతో కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొనడం చూడొచ్చు. ఈ ప్రెస్‌మీట్లో లారీ యజమానులు మరో వ్యక్తిపై ఆరోపణలు చేస్తున్న సమయంలో మాధవ్ కలగజేసుకుని ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పు అని అన్నట్టుగా ఉంది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. మీడియా సమక్షంలోనే ఇంత కుట్ర చేసిన వాళ్లు, తెరవెనుక ఇంకెన్ని చేస్తున్నారో ఆలోచించాలని, టీడీపీ నేతలపై ప్రభుత్వం పెడుతున్నవి అక్రమ కేసులని చెప్పడానికి ఇంతకన్నా
నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.

Next Story

Most Viewed