పోలవరానికి వైసీపీ గ్రహణం పట్టింది

by  |
Chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టుకు వైసీపీ గ్రహణం పట్టిందని విమర్శించారు. 72శాతం పూర్తయిన ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అత్యాచారాలు, ఆత్మహత్యలు పెరిగాయని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలన్నీ రద్దు చేయాలని అన్నారు. అలాంటి స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరుపాలని అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed