పొగాకు రైతుల సమస్యలపై చంద్రబాబు లేఖ

by  |
TDP
X

ఏపీలో పొగాకు రైతుల సమస్యలపై చంద్రబాబు పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబుకు లేఖ రాశారు. పొగాకు రైతులను తక్షణమే ఆదుకోవాలన్నారు. లాక్‌డౌన్ కారణంగా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను రిటైల్ మార్కెట్ల్‌లో అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కానీ పొగాకు రైతులకు ఆ వెసులుబాటు లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయిందన్నారు. వెంటనే వేలం నిర్వహించాలని పొగాకు బోర్డుకు సూచించారు. ఇప్పటికే కరోనా కారణంగా మార్చిలో జరగాల్సిన వేలం నిలిచిపోయిందని.. ఇంకా ఆలస్యమైతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags: Tobacco, farmers, chandrababu, tobacco board



Next Story

Most Viewed