నన్నెందుకు ఓడించారో నాకే తెలియదు: చంద్రబాబు

by  |
నన్నెందుకు ఓడించారో నాకే తెలియదు: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలు తనను ఎందుకు ఓడించారో.. తనకే తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి చేయడమే తన తప్పుయితే క్షమించాలంటూ ప్రజలను వేడుకున్నారు. కృష్ణా జిల్లా పరిటాలలో చంద్రబాబు నివాసం వద్ద రైతులతో కలిసి బోగి మంటలు వేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ జీవోలను ఆయన బోగి మంటల్లో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 40 ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చిన్న తప్పుచేయలేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క గుడిపై కూడా దాడి జరగలేదన్న చంద్రబాబు… వైసీపీ హయాంలో 150 ఆలయాలపై దాడులు జరగడం దారుణమన్నారు. ఇక బోర్లకు మీటర్లు పెట్టే బదులు.. వైసీపీ ఎమ్మెల్యేలకు మీటర్లు పెడితే ఎవరు ఎంత కొట్టేశారో తెలుస్తోందని చురకలు వేశారు.


Next Story

Most Viewed