బాధ్యత లేదు, భక్తి లేదు, లెక్కలేదు !

by  |
Chandrababu Naidu
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత లేదు, భక్తి లేదు, ప్రజలంటే లెక్కలేదని విమర్శించారు. శనివారం విజయనగరం పార్లమెంట్ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సామర్థ్యం.. కరోనా, వరదల సమయంలోనే బయట పడిందని, వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాల మీద కష్టాలొచ్చాయన్నారు. తొలి ఏడాది ఇసుక లేక లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయారని, ఇప్పుడు కరోనా కారణంగా ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా వైసీపీ కక్కుర్తి పడటం హేయమైన చర్య అన్నారు.


Next Story

Most Viewed