ఇలాంటి దుర్మార్గ పాలన ఎన్నడూ చూడలే : చంద్రబాబు

by  |
Chandrababu naidu
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ప్రస్తుతం దుర్మార్గ పాలన నడుస్తోందని, ఇలాంటిది దేశంలో ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేర చరిత్రగల వాళ్లు అధికారంలోకి వస్తే వాటిల్లే ఉపద్రవాలకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఉదాహరణ అని బాబు చెప్పుకొచ్చారు. ఒక తప్పు చేయడం, ఆ తప్పును కప్పిపుచ్చకోడానికి ఇంకా పెద్దతప్పు చేయడం సీఎం జగన్ కు నిత్యకృత్యం అయ్యిందని మండిపడ్డారు.

ఇచ్చిన అధికారం ప్రజలను చంపడానికి లైసెన్స్ అనుకుంటున్నారా..? అని బాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తన అవినీతి బురద ఇతరులకు అంటించడం, తప్పుడు వార్తలతో ప్రజల్లో అపోహలు పెంచడం జగన్ నైజమని.. ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయడం.. బెదిరించి, భయపెట్టి లోబర్చుకోవడం ఆయన రాజకీయమని మండిపడ్డారు.

‘గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీలోని 5 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పంటలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతివృత్తులవారు ఉపాధి కోల్పోయారు. అటు కరోనా బాధితులను, ఇటు వరద బాధితులను ఆదుకునేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గిట్టుబాటు ధర, విపత్తు సాయం ఏదీ లేదు. రైతులను రెండు విధాలా నష్టాల్లో ముంచారు. మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని రైతులంతా వ్యతిరేకిస్తున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది. రైతాంగ వ్యతిరేక చర్యలను అడ్డుకోవాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


Next Story