టీడీపీలో ఆ ఐదుగురికి కీలక బాధ్యతలు

by  |
టీడీపీలో ఆ ఐదుగురికి కీలక బాధ్యతలు
X

దిశ, ఏపీబ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు ఐదుగురు ప్రధాన కార్యదర్శులకు కీలక బాధ్యతలు అప్పగించారు. జమిలీ ఎన్నికలొస్తాయని ఊహించిన నేపథ్యంలో ఇప్పటి నుంచే లోక్​సభ నియోజకవర్గాల్లో కసరత్తు ప్రారంభించారు. ఒక్కొక్కరికి 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యతలు ఇచ్చారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలను 5 జోన్లుగా విభజించారు.

బుద్దా వెంకన్నకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అరకు, పంచుమర్తి అనురాధకు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, చెంగల్రాయుడికి విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, అనగాని సత్యప్రసాద్‍కు ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట అప్పగించారు. అమర్‍నాథ్‍రెడ్డికి కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలు కేటాయించారు. దేవినేని ఉమకు ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయ బాధ్యతలు అప్పగించారు. పయ్యావుల కేశవ్‍కు అధికార ప్రతినిధులపై పర్యవేక్షణ బాధ్యతనిచ్చారు. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామికి 25 లోక్‍సభ స్థానాల నుంచి వచ్చే నివేదికలు పరిశీలించే విధులు అప్పగించారు.


Next Story

Most Viewed