‘దాడులను నియంత్రించలేక మా పై బురద జల్లుతున్నారు’

by  |
Chandrababu
X

దిశ,వెబ్‌డెస్క్: దాడులు, విధ్వంసాలను నియంత్రించలేక టీడీపీపై వైసీపీ నాయకులు బురద జల్లుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతి పార్లమెంట్ టీడీపీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ దుర్మార్గాలపై ప్రజాతీర్పుకు తిరుపతి ఉప ఎన్నికలు తొలి పరీక్ష అని అన్నారు.

ఆలయాలపై దాడులతో రాజకీయాలకు సంబంధం లేదని ఆయన తెలిపారు. దాడిని ఉన్మాదుల పనిగా భోగి రోజున డీజీపీ చెప్పారని పేర్కొన్నారు. ఇప్పుడు మాట మార్చి ప్రతిపక్షాలకు అంటగడుతున్నారని వివరించారు. . సజ్జల స్క్రిప్ట్, జగన్ రెడ్డి డైరెక్షన్‌లో డీజీపీ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసిన వైసీపీ వాళ్లను కేసుల నుంచి తప్పించారని అన్నారు. దాడులను బయటపెట్టిన వారిపై కేసులు పెట్టారని చెప్పారు.


Next Story

Most Viewed