- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హాలియా: కష్టపడి పనిచేసే వారికి టీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా ఫలితం లభిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని అన్ని మండల, గ్రామాల్లో నూతన కమిటీలు 80 శాతం ఏర్పాటు చేశామని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా కమిటీలు కూడా పూర్తి చేసి నాగార్జునసాగర్ రాష్ట్రంలోనే ముందుండేలా చేస్తామని అన్నారు. కష్టపడి పార్టీ కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు టీఆర్ఎస్లో గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామ అధ్యక్షులు చురుగ్గా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్, శంకరయ్య, వర్ర వెంకటరెడ్డి, కూరాకుల వెంకటేశ్వర్లు, చేరుపల్లి ముత్యాలు, రాంబాబు, బొల్లం రవి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.