గంగలో ప్రవహించే మృతదేహాలకు కేంద్రానిదే బాధ్యత..

by  |
Rahul Gandhi
X

న్యూఢిల్లీ : గంగా నదిలో ప్రవహిస్తున్న మృతదేహాలకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. గంగలో మృతదేహాలు కొట్టుకుపోవడాన్ని చూసి దేశం, యావత్ ప్రపంచమూ నివ్వెరపోయిందని ట్వీట్ చేశారు. తమ బంధువుల మృతదేహాలు గంగలో కొట్టుకుపోతున్నప్పుడు నిస్సహాయంగా నిలిచిన కుటుంబీల బాధనూ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని తెలిపారు. అది వారి తప్పు కాదని, ఇది అందరి బాధ్యతా కాదనీ స్పష్టం చేశారు. దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.



Next Story

Most Viewed