ఆ 5 రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్రం ఫోకస్ 

by  |
ఆ 5 రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్రం ఫోకస్ 
X

న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా నమోదవుతున్న ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్ర బృందాలు పర్యవేక్షించనున్నాయి. కేరళ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్‌లను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆయా రాష్ట్రాల నోడల్ అధికారులు లేదా జాయింట్ సెక్రెటరీ, ప్రజా ఆరోగ్య నిపుణుడు, క్లినీషియన్‌లు ఈ బృందంలో ఉండనున్నారు. కరోనా సర్వేలెన్స్, టెస్టులు, వ్యాప్తి నివారణ, కట్టడి చర్యలు, పాజిటివ్ కేసులకు చికిత్స వంటి విషయాల్లో ఈ బృందాలు రాష్ట్రాలకు చేదోడువాదోడుగా ఉండనున్నాయి.


Next Story

Most Viewed