ఏపీలో కేంద్రం బృందం పర్యటన

by  |
ఏపీలో కేంద్రం బృందం పర్యటన
X

దిశ, ఏపీ బ్యూరో: భారీ వర్షాలు, వరదల వల్ల నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చే వారం ఏపీలో కేంద్ర బృందం పర్యటించనుంది. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4500 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని ఇటీవల సీఎం హోంమంత్రికి లేఖ రాశారు. దీనిపై నష్టం అంచనా వేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి రాకేష్ కుమార్ సింగ్ నేతృత్వంలో బృందం వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయం, జలవనరులు, విద్యుత్, రోడ్లు, గ్రామీణ శాఖ అధికారులు బృందంతోపాటు పర్యటిస్తారు.


Next Story