నేడు గుంటూరులో కేంద్ర బృందం పర్యటన

by  |
నేడు గుంటూరులో కేంద్ర బృందం పర్యటన
X

అమరావతి: కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం శుక్రవారం గుంటూరులో పర్యటించనుంది. గుంటూరు, నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటించనున్నట్టు తెలుస్తోంది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు 373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో గుంటూరు రెండో స్థానంలో నిలిచింది.

Tags: corona, central team, visit, guntur, narasaraopet, ap


Next Story