‘అగ్నికి ఆజ్యంపోసేలా సోనియా వ్యాఖ్యలు’

by  |
‘అగ్నికి ఆజ్యంపోసేలా సోనియా వ్యాఖ్యలు’
X

ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ చేసిన విమర్శలను కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ ఖండించారు. సోనియా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయని మండిపడ్డారు. భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆమె మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశభద్రతను రాజకీయం చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాగా, ఢిల్లీలో జరుగుతున్న సీఏఏ నిరసనలు హింసాత్మకంగా మారి, 20మంది మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై సోనియాగాంధీ స్పందిస్తూ.. హింసను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు.

Next Story

Most Viewed