కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఇంట్లో విషాదం

by  |
కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఇంట్లో విషాదం
X

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి చంద్రకాంతా గోయల్ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పియూష్ గోయల్ తెలియజేశారు. ఆమె ఫొటోను పోస్ట్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అదేవిధంగా తన తల్లి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదని, తనను కూడా సేవామార్గంలో నడవాలని సూచించేందని, ఆమెను చూసే తాను ప్రేరణ పొందానని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అందులో పేర్కొన్నారు. చంద్రకాంతా గోయల్ మృతి పట్ల పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పియూష్ గోయల్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Next Story

Most Viewed