- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోగులంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కానీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
పీఎం కేర్ నిధి కింద గాంధీలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం సమంజసం కాదన్నారు. జూడాల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కేంద్రమంత్రి సూచించారు. బ్లాక్ ఫంగస్ మందులను రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ లోకి తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story