రేపు దుర్గమ్మను దర్శించకోనున్న కిషన్ రెడ్డి

by  |
రేపు దుర్గమ్మను దర్శించకోనున్న కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : విజయదశమి పండుగను పురస్కరించుకుని కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు.ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

ఈ రాత్రికి హైందవి కార్యాలయంలో నిర్వహించే మీటింగ్‌లో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అనంతరం హోటల్లో బస చేయనున్నారు. రేపు ఉదయం దుర్గమ్మను దర్శించుకున్నాక.. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గన్నవరం నుంచి తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.

Next Story

Most Viewed