ఆ కేంద్రమంత్రి ఒక క్రిమినల్.. ఆయనను బర్తరఫ్ చేయండి: పార్లమెంటులో రాహుల్ గాంధీ

by  |
Rahul-Gandhi-1
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంటులో గురువారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. కేంద్రమంత్రి ఆశీష్ మిశ్రా ఒక క్రిమినల్.. ఆయనను మంత్రి వర్గంలో నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ పార్లమెంటులో ఆందోళన చేశారు. లిఖింపూర్ ఖేరీ ఘటనపై మాట్లాడేందుకు తమకు అనుమతి ఇవ్వాలని, అందులో మంత్రి ప్రమేయం ఉందని, అది ఒక కుట్ర అని రాహుల్ అన్నారు. మిగతా కాంగ్రెస్ సభ్యులు కూడా రాహుల్ కు మద్దతుగా నిలిచారు. వారు కూడా ఆశీష్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed