- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి నుంచి 247 టీఎంసీలు తరలిస్తాం.. కేంద్రం వెల్లడి
<p>దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను ఏప్రిల్లోనే రాష్ట్రాలకు పంపించామని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేష్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో ఆయన ఈ అంశంపై సోమవారం వివరణ ఇచ్చారు. గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీలను తరలించేందుకు ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా బేసిన్ మీదుగా ఈ నీటిని తరలిస్తామని, మూడు లింకులుంటాయని వివరించారు. గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి మొదలవుతుందని, నాగార్జున సాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి–కావేరి లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను ఏప్రిల్లోనే రాష్ట్రాలకు పంపించామని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేష్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో ఆయన ఈ అంశంపై సోమవారం వివరణ ఇచ్చారు. గోదావరి నుంచి కావేరికి 247 టీఎంసీలను తరలించేందుకు ప్రాజెక్టును రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా బేసిన్ మీదుగా ఈ నీటిని తరలిస్తామని, మూడు లింకులుంటాయని వివరించారు. గోదావరిపై ఇచ్చంపల్లి నుంచి మొదలవుతుందని, నాగార్జున సాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా) నుంచి కావేరి (గ్రాండ్ అనికట్) వరకు తరలిస్తామన్నారు. తమిళనాడుకు సాగు, తాగునీటి అవసరాల కోసం 200 టీఎంసీలు కావాలని కోరిందని, అయితే దీనిపై పూర్తిస్థాయి డీపీఆర్ను రూపొందించి, రాష్ట్రాలకు పంపించామన్నారు. కానీ రాష్ట్రాల నుంచి ఇంకా ఎలాంటి రిప్లై రాలేదని బిశ్వేష్వర్ తుడు రాజ్యసభలో చెప్పారు. ఈ గోదావరి–కావేరీ లింక్ ప్రాజెక్టుకు ఇంకా నిధుల కేటాయింపు చేయలేదన్నారు.






