నదీ జలాలపై కేంద్రం కొత్త ఉత్తర్వులు..

by  |
central jal sakthi
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు సీనియర్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్లను నియమిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా బోర్డుకు ప్రస్తుతం కోయంబత్తూరులో సీడబ్ల్యూసీ తరుపున ఉన్న సీఈ టీకే శివరాజన్​, లక్నో యూజీబీఓ సీఈ అనుపమ ప్రసాద్​లను నియమించారు. అదే విధంగా గోదావరి బోర్డుకు ఢిల్లీలోని సీడబ్ల్యూసీ సీఈ ఎంకే సిన్హా, మరో సీఈ జీకే అగర్వాల్​ను అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. బోర్డుల పరిధిలోని ఇంజినీర్లు ఇక నుంచి వీరి ఆధ్వర్యంలోనే పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ అధికారులు కంటిన్యూ అవుతారని జీవోలో పేర్కొన్నారు.


Next Story

Most Viewed