విదేశీ పర్యాటకులకు షాకిచ్చిన కేంద్రం.. వీసా నిబంధనల్లో మార్పులు!

by  |
విదేశీ పర్యాటకులకు షాకిచ్చిన కేంద్రం.. వీసా నిబంధనల్లో మార్పులు!
X

దిశ, వెబ్‌డెస్క్ : విదేశీ పర్యాటలకు భారత ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఇక మీదట రోడ్డు మార్గం ద్వారా దేశంలోనికి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి వీసా ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ పర్యాటకులు తప్పనిసరిగా జల, వాయు మార్గాల్లోనే ఇండియాలో ప్రవేశించాలని స్పష్టంచేసింది.

అయితే, రోడ్డు మార్గాల్లో వచ్చే వారికి వీసా నిరాకరించడం వలన దేశంలో అలజడులు జరగకుండా కొంతమేర అడ్డుకోవచ్చని కేంద్ర హోంశాఖ భావించినట్టు తెలుస్తోంది. ఇకమీదట ఇండియాకు వచ్చే సందర్శకులు నూతన వీసా మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story

Most Viewed