కరోనా రికవరీ రేటు 75శాతం కంటే ఎక్కువ : రాజేశ్ భూషణ్

by  |
కరోనా రికవరీ రేటు 75శాతం కంటే ఎక్కువ : రాజేశ్ భూషణ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వ్యాప్తి, కేసుల పెరుగుదల, రికవరీకి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తాజా గణాంకాలు విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ లో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 22.2శాతం మాత్రమే ఉండగా, రికవరీ రేటు మాత్రం ఇప్పుడు 75శాతం కంటే ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రకటించారు.

అంతేకాకుండా, కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న వారి సంఖ్య.. యాక్టివ్ కేసుల సంఖ్య కంటే 3.4 రేట్లు ఎక్కువగా ఉందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

Next Story

Most Viewed