- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి గ్రామీణ రహదారులు, విస్తరణ, వంతెనల నిర్మాణం కోసం రూ.606.88 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు రాష్ట్రం తన వాటాగా రూ.413.73 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారమందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లు మంజూరు చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కేంద్ర సర్కార్ తాజాగా కేటాయించిన నిధులకు రాష్ట్ర సర్కార్ వెంటనే మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేసి రహదారుల నిర్మాణం, విస్తరణకు తోడ్పాటును అందించాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు.