- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ముంబైలో బ్యాంకర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రి మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న దాని కంటే బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం, అప్డేట్ చేయాలని, వినియోగదారులకు సత్వర సేవలు అందించడానికి మరిన్ని మార్పులు చేయాలని తెలిపారు. అయితే, ఈశాన్య రాష్ట్రాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా దృష్టి సారించాలని కేంద్ర మంత్రి ఆదేశించారు.
అంతేకాకుండా, ఈశాన్య రాష్ట్రాల వ్యాపారులకు అధికంగా రుణాలు ఇవ్వాలని సూచించారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ వాగ్దానం మేరకు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన దిశగా కేంద్రం ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అక్కడి ప్రజల జీవనాభివృద్ధి కోసం బ్యాంకులు తమ వంతు తోడ్పాటు అందించాలని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది.