ఉపఎన్నికల షెడ్యూల్.. రాష్ట్రాలకు ఈసీ కీలక ఆదేశాలు

by  |
ec
X

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేల్ ఉపఎన్నికకు అక్టోబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. కరోనా ఆంక్షల మధ్యే బై ఎలక్షన్స్ జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. పార్టీ మీటింగుల్లో వెయ్యికి మించకుండా జనం రాకూడదని స్పష్టం చేసింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ వెల్లడించింది. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని మరో 28 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.



Next Story